Tuesday, 18 February 2014

దేవుడు శిలువ ఫై మరణించాడా ??? అన్న అంశం ఫై రీసెంట్ గా నాకు  ఓ పాస్టర్ తో చర్చ జరిగింది

నేను అతనితో .... దేవుడికి ఆది అంతం ,చావు పుట్టుకలు ఉన్నాయా ?  దేవుడు చనిపోతాడా అని ప్రశ్నించాను ?
పాస్టర్ గారు నాతో .... లేదు..  దేవుడికి ఆది అంతం ,చావు పుట్టుకలు ఉండవు అన్నాడు

నేను :  దేవుడి దూతలు (ఏంజిల్స్ ) చనిపోతాయా అని ప్రశ్నించాను ?
పాస్టర్ గారు :.  వాటికి కూదా చావు వుండదు అన్నాడు ...!

మరి ఏసు దేవుడా ..? దేవుని దాసుడా ...? అని ప్రశ్నించాను ???
అతను నాతో ... మనకోసం రక్తం చిందించిన దేవుడు అన్నాడు

నేను :  అంటే దేవుడు శిలువ ఫై మరణించాడా అని ప్రశ్నించాను ?
పాస్టర్ గారు :- అవును మన పాపాల కోసం రక్తం చిందించాడు, మరణించి మూడవ దినమున లేచాడు అన్నాడు ,

నేను : ...ముందుగా దేవుడికి ఆది అంతం ,చావు పుట్టుకలు ఉండవు అన్నారు కదా ... ??? అన్నాను
పాస్టర్ గారు :-  ( నాలుక కరుచుకొని )...  నాతో .. దేవుడికి సమస్తము సాద్యము అందుకే  మన పాపాల కోసం రక్తం చిందించాడు, మరణించి మూడవ దినమున లేచాడు అన్నాడు ,
మరణించి మూడవ దినమున లేచాడు కాబట్టి ఆయన దేవుడు అన్నాడు

నేను : .. మరణించి మూడవ దినమున ఆయనే లేచాడా ???, దేవుడు ఆయన్ని లేపాడా ???  అని ప్రశించాను ..
పాస్టర్ గారు :-. నాతో లేదు ఆయనే స్వయంగా మూడవ దినమున లేచాడు  అని అన్నాడు

నేను : .. మరి నన్ను రక్షించు అని మాటిమాటికి దేవునికి ఎందుకు ఏడుస్తూ ప్రార్దన చేసాడు ..??? అని ప్రశ్నించాను
పాస్టర్ గారు :-...( నాలుక కరుచుకొని )...నాతో ... మానవుడిగా వున్నాడు అందుకే అలా చేసాడు అన్నాడు

నేను :  మానవుడిగా వున్నాడు కాబట్టి ... తానూ దేవుణ్ణి అన్న సంగతి మరిచి పోయాడా ???  అని ప్రశించాను ..
పాస్టర్ గారు :- పాస్టర్ గారి దగ్గర సమాదానం లేదు

నేను : - దైవదూత మరణించిందంటే నవ్వుతారు దేవుడు మరణించాడంటే హాస్యాస్పదం కాదా ??? అన్నాను
పాస్టర్ గారు :-  సమాదానం లేదు

నేను :  మరి మీరే ఆలోచించండి ...???
ఆది అంతం , పుట్టుక మరణం లేని దేవుడు మరణించాడని  చెప్పడం హాస్యాస్పదం (జోక్ )కాదా ...:-)

పాస్టర్ గారు :- మీరు ఎన్ని చేప్పినా ఏసయ్యనే మా దేవుడు అని మా విశ్వాసం అన్నాడు

నేను :  ఏసు వారు తన జీవిత కాలంలో .....  నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎప్పుడు చెప్ప లేదు ...
ఏసు దేవుడు అయితే కష్టకాలం లో నన్ను రక్షించమని  ఏసు ఎందుకు ఏడుస్తారు ...

షిరిడీ సాయి కూడా నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎప్పుడు చెప్ప లేదు ....
ఆయన బ్రతికి ఉన్నప్పుడు  ... సబ్ కా మాలిక్ ఏక్  హై  , అల్లాహ్ మాలిక్ , అల్లాహ్ బాలా కరేగా అన్నారు,
నమాజు చేస్తూ తన జీవితాన్ని గడిపారు ,
కాని మరణించి లేచాడు అన్న సాకు తోనే  ఈ రోజు షిరిడీ సాయి లాంటి వారిని కూడా దేవుడి గా చేసారు ....

ఆది అంతం , పుట్టుక మరణం లేని దేవుడు మరణించాడని  చెప్పడం హాస్యాస్పదం (జోక్ )కాదా ...:-)

NOTE : కాని ఏసు వారు, కాని సాయి బాబా కాని  వీళ్ళ మాటలు వింటే ...
దేవుణ్ణి విడిచి వీరు తమను ఆరాదిస్తున్నారని తెలిస్తే (నా మనస్సులో ఇలా  అనిపించింది,)
మీము బ్రతికి ఉన్నప్పుడు మీమే ఆ దేవుణ్ణి జీవితాంతం ఆరాదించాము,
కష్టకాలంలో ఆ దేవుణ్ణి ఏడుస్తూ ప్రార్దించాము ...
మీము మరణించి న తరువాత మమ్ములను ఆరాధిస్తే ఏం  దొరుకుతుంది
అని వారి ఆత్మలు గోషిస్తున్నట్లుగా అనిపించింది

ఎవరినీ నొప్పించాలని కాదు ..
మీమ్ములను ఆలోచింప చేయాలని ఓ చిరు ప్రయత్నం
నొచ్చుకుంటే క్షమించండి







Tuesday, 11 February 2014

మరిన్ని వివరాలకు వీక్షించండి ..... 

ప్రపంచంలోని సర్వమానవులకు మోక్షమార్గాన్ని చూపడానికి సర్వలోకాల సృష్టి కర్త పంపిన సర్వోన్నత దర్మమే ఇస్లాం 


కాని దురదుష్టవశత్తు ముస్లిం కుటుంబం లో పుట్టినప్పటికీ  
అల్లాహ్ అర్ధం తెలియని వారు 

అల్లాహ్ అంటే ముస్లిం ల దేవుడిగా భావిచేవారు 

ఇస్లాం అంటే అర్థం  తెలియని వారు

ముస్లిం అంటే అర్థం  తెలియని నామ మాత్రపు ముస్లింలు ఎంతో మంది వున్నారు 


ముస్లిం అవిస్వాసులుగా జీవితం గడుపుతుంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బ్రాహ్మణ పండితులు, పాస్టరులు, మహామహులు సత్యాన్వేషణ చేసి ఇస్లాం ధర్మం స్వీకరిస్తున్నారు

ఇస్లాం గురించిన కొన్ని విషయాలు గమనించండి .....   

 అల్లాహ్ అంటే ఎవరో తెలుసా ? అల్లాహ్ ముస్లిం ల దేవుడా ?
        భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని
ఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో , లెక్కా తీసుకుంటాడో.
ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు
అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం. కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు) కాని, పీర్లు కాని, బాబాలు కాని మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం'
దురదుష్టవశాత్తు ధార్మిక జ్ఞానం లేని కొందరు ముస్లింలు
సమాడులను పూజించడం కూడా ఇస్లాం లో బాగమే అనుకుంటున్నారు కాని
వాస్తవానికి
ఇస్లాం కు ఈ దర్గాలతో , సమాదులతో ఎటువంటి సంబంధం లేదు
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం ముస్లింలకు ప్రవక్తనా? 

ఈ రోజు సమాజంలో ముస్లిమేతర సోదరులలోనే కాకుండా ధార్మిక జ్ఞానంలేని ముస్లిం సోదరులలో కూడా ఈ అపోహ వుంది. వాస్తవానికి ఖుర్'ఆన్ గ్రంధంలో ఎక్కడ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లింలకు మాత్రమే ప్రవక్త అని చెప్పబడి లేదు. ఖుర్'ఆన్ గ్రంధంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కి ప్రవక్తగా పంపించబడ్డారు అని బోధించబడింది. ఉదాహరణకు ఖుర్'ఆన్ వాక్యాలను గమనించండి: 

"ఓ ప్రవక్తా! మేము ముంములను సర్వ మానవాళికి సందేశహరునిగా శుభవార్త ఇచ్చేవానిగా హెచ్చరించే వానిగా నియమించి పంపాము.  (ఖుర్'ఆన్ 34:28)

మానవులందరి సందేశహరునిగా పంపించాము :

"గత ప్రవక్తలు ఒక ప్రత్యెక జాతికో, ప్రత్యెక కాలానికో పంపబడ్డారు, కాని ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయం వరకు సర్వ మానవాళికి ప్రవక్తగా పంపబడ్డారు.  (ఖుర్'ఆన్ 4:79)

అందుకే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి యొక్క ప్రస్తావన హిందూ మరియు క్రైస్తవ మత గ్రంధాలలోనే కాకుండా జైన,బౌద్ధ మతగ్రందాలలో కూడా ముందుగానే ప్రస్తావించబడింది

ఖుర్ఆన్ ముస్లింల కోసం అవతరించిందా.....?

ఖుర్ఆన్ ముస్లింల గ్రంథమని  ఎక్కడా  రాయబడి లేదు.

ఖుర్ఆన్  సర్వమానవాళి  కోసం  అవతరించింది అని

స్వయంగా  ఖుర్ఆన్ సాక్ష్యమిస్తుంది . ఉదా :-

సర్వ మానవులకు  ఇదొక (ఖుర్ఆన్)  సందేశం. అందరినీ హెచ్చరించాలని

అందరూ  యధార్ధదంగా దేవుడు ఒక్కడే  అని తెలుసుకోవాలని ,బుద్ది

వున్నవాడు  గ్రహించాలని  ఇది  పంప బడింది. దివ్యఖుర్ఆన్(14:52);

ఖుర్ఆన్ మానవులందరికీ  మార్గదర్శకం. ఋజుమార్గం  చూపే

సత్యాఅసత్యను  వేరుపరిచే  స్పష్టమైన ఉపదేశాలు  దీనిలో వున్నాయి.దివ్యఖుర్ఆన్ (2:185)

ఇస్లాం సందేశము  ఏమిటి  ? 

మానవులంతా ఒకే జంట సంతానం.అందరు పరస్పరం  సోదరులు 

 మనవులందరి దేవుడు ఒక్కడే(అవ్యక్తుడు,అగోచరుడు,అచింత్యుడు)

ఆయన తప్ప మరో దేవుడు లేడు .


మీలో మంచి పనులు చేసేవారెవరో చెడ్డ పనులు చేసేవారెవరో 

పరిక్షించి చూద్దామని మీకు జీవితాన్ని ఇచ్చాము 


దేవుడు లెక్క తీసుకుంటాడు అన్న భయం తో
 

మంచి జీవితాన్ని గడిపిన వాడికి శాశ్వత స్వర్గం వుంది

ఇష్టం వచ్చినట్లు జీవితాని గడిపిన వానికి శాశ్వతనరకం వుంది

(ఖుర్ ఆన్  67:3)
ముస్లిం అంటే  ఏవరు....? 
దేవుడు (నిజ  ఆరాధ్యుడు) ఒక్కడు  అని  విశ్వసించి  ఆయన ప్రవక్తలను  మరియు గ్రంథాలను  అనుసరించే వాడిని  అరబ్బీ భాషలో  ముస్లిం (దైవ విధేయుడు ) అని అంటారు. ముస్లిం అంటే విశ్వాసానికి సంబందించిన పదం.  కానీ, ఇది  వంశపారంపర్యంగా  వచ్చేది కాదు. ఖుర్ ఆన్ ప్రకారం అగోచరుదు అయిన  అల్లాహ్ ను  మాత్రమే అరాదించేవాడిని ముస్లిం (దైవ విధేయుడు ) అంటారు.  కానీ దర్గాలను, పీర్లను, మనుష్యుల  లేదా  జంతువుల ప్రతిరుపాలను  ఆరాధించేవాడిని ముష్రిక్ (బహుదేవారాధకుడు) అంటారు. ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ బహుదేవారాధన  చేస్తే  అతను  అల్లాహ్ దృష్టిలో  ముస్లిం  (దైవ విధేయుడు )గా  పరిగణిoచబడడు.

ఇస్లాం ఎలా స్వీకరించాలి ???
"లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ ర్రసూలుల్లాః "

ఇస్లాం స్వీకరించడానికి కలిమాను  (సద్వచనమ్) మనస్పూర్తి గా చదవాలి 
అంటే  "లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ ర్రసూలుల్లాః " అని సాక్ష్యం చెప్పాలి

ఇస్లాం పరిధిలో ఒక వ్యక్తి "లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ ర్రసూలుల్లాహ్" పవిత్ర వచనాన్ని అని మనస్పూర్తి గా సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఇక మీద ముస్లిం గా పరిగణించబడుతాడు 
ఈ వచనంలో కేవలం రెండు వాక్యాలు ఉన్నాయి.
1. లా ఇలాహ ఇల్లల్లాహ్ (తౌహీద్- దేవుని ఏకత్వపు వచనము)
2. ముహమ్మదుర్ ర్రసోలుల్లాహ్ (రిసాలత్- దైవ దౌత్య వచనం)