Tuesday, 18 February 2014

దేవుడు శిలువ ఫై మరణించాడా ??? అన్న అంశం ఫై రీసెంట్ గా నాకు  ఓ పాస్టర్ తో చర్చ జరిగింది

నేను అతనితో .... దేవుడికి ఆది అంతం ,చావు పుట్టుకలు ఉన్నాయా ?  దేవుడు చనిపోతాడా అని ప్రశ్నించాను ?
పాస్టర్ గారు నాతో .... లేదు..  దేవుడికి ఆది అంతం ,చావు పుట్టుకలు ఉండవు అన్నాడు

నేను :  దేవుడి దూతలు (ఏంజిల్స్ ) చనిపోతాయా అని ప్రశ్నించాను ?
పాస్టర్ గారు :.  వాటికి కూదా చావు వుండదు అన్నాడు ...!

మరి ఏసు దేవుడా ..? దేవుని దాసుడా ...? అని ప్రశ్నించాను ???
అతను నాతో ... మనకోసం రక్తం చిందించిన దేవుడు అన్నాడు

నేను :  అంటే దేవుడు శిలువ ఫై మరణించాడా అని ప్రశ్నించాను ?
పాస్టర్ గారు :- అవును మన పాపాల కోసం రక్తం చిందించాడు, మరణించి మూడవ దినమున లేచాడు అన్నాడు ,

నేను : ...ముందుగా దేవుడికి ఆది అంతం ,చావు పుట్టుకలు ఉండవు అన్నారు కదా ... ??? అన్నాను
పాస్టర్ గారు :-  ( నాలుక కరుచుకొని )...  నాతో .. దేవుడికి సమస్తము సాద్యము అందుకే  మన పాపాల కోసం రక్తం చిందించాడు, మరణించి మూడవ దినమున లేచాడు అన్నాడు ,
మరణించి మూడవ దినమున లేచాడు కాబట్టి ఆయన దేవుడు అన్నాడు

నేను : .. మరణించి మూడవ దినమున ఆయనే లేచాడా ???, దేవుడు ఆయన్ని లేపాడా ???  అని ప్రశించాను ..
పాస్టర్ గారు :-. నాతో లేదు ఆయనే స్వయంగా మూడవ దినమున లేచాడు  అని అన్నాడు

నేను : .. మరి నన్ను రక్షించు అని మాటిమాటికి దేవునికి ఎందుకు ఏడుస్తూ ప్రార్దన చేసాడు ..??? అని ప్రశ్నించాను
పాస్టర్ గారు :-...( నాలుక కరుచుకొని )...నాతో ... మానవుడిగా వున్నాడు అందుకే అలా చేసాడు అన్నాడు

నేను :  మానవుడిగా వున్నాడు కాబట్టి ... తానూ దేవుణ్ణి అన్న సంగతి మరిచి పోయాడా ???  అని ప్రశించాను ..
పాస్టర్ గారు :- పాస్టర్ గారి దగ్గర సమాదానం లేదు

నేను : - దైవదూత మరణించిందంటే నవ్వుతారు దేవుడు మరణించాడంటే హాస్యాస్పదం కాదా ??? అన్నాను
పాస్టర్ గారు :-  సమాదానం లేదు

నేను :  మరి మీరే ఆలోచించండి ...???
ఆది అంతం , పుట్టుక మరణం లేని దేవుడు మరణించాడని  చెప్పడం హాస్యాస్పదం (జోక్ )కాదా ...:-)

పాస్టర్ గారు :- మీరు ఎన్ని చేప్పినా ఏసయ్యనే మా దేవుడు అని మా విశ్వాసం అన్నాడు

నేను :  ఏసు వారు తన జీవిత కాలంలో .....  నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎప్పుడు చెప్ప లేదు ...
ఏసు దేవుడు అయితే కష్టకాలం లో నన్ను రక్షించమని  ఏసు ఎందుకు ఏడుస్తారు ...

షిరిడీ సాయి కూడా నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎప్పుడు చెప్ప లేదు ....
ఆయన బ్రతికి ఉన్నప్పుడు  ... సబ్ కా మాలిక్ ఏక్  హై  , అల్లాహ్ మాలిక్ , అల్లాహ్ బాలా కరేగా అన్నారు,
నమాజు చేస్తూ తన జీవితాన్ని గడిపారు ,
కాని మరణించి లేచాడు అన్న సాకు తోనే  ఈ రోజు షిరిడీ సాయి లాంటి వారిని కూడా దేవుడి గా చేసారు ....

ఆది అంతం , పుట్టుక మరణం లేని దేవుడు మరణించాడని  చెప్పడం హాస్యాస్పదం (జోక్ )కాదా ...:-)

NOTE : కాని ఏసు వారు, కాని సాయి బాబా కాని  వీళ్ళ మాటలు వింటే ...
దేవుణ్ణి విడిచి వీరు తమను ఆరాదిస్తున్నారని తెలిస్తే (నా మనస్సులో ఇలా  అనిపించింది,)
మీము బ్రతికి ఉన్నప్పుడు మీమే ఆ దేవుణ్ణి జీవితాంతం ఆరాదించాము,
కష్టకాలంలో ఆ దేవుణ్ణి ఏడుస్తూ ప్రార్దించాము ...
మీము మరణించి న తరువాత మమ్ములను ఆరాధిస్తే ఏం  దొరుకుతుంది
అని వారి ఆత్మలు గోషిస్తున్నట్లుగా అనిపించింది

ఎవరినీ నొప్పించాలని కాదు ..
మీమ్ములను ఆలోచింప చేయాలని ఓ చిరు ప్రయత్నం
నొచ్చుకుంటే క్షమించండి







No comments:

Post a Comment